మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా మధిరలోని మహిమాన్విత శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో మధిర శాసనసభ్యులు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, ఈ ఓ జగన్మోహన్రావు అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం భట్టి విక్రమార్క దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ చైర్మన్, ఈవో, కమిటీ సభ్యులతో కలిసి సన్మానించారు.