రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ మేరకు అక్రమంగా మద్యం రవాణా గాని అమ్మకాలపై స్పెషల్ ఎన్ పోర్స్ మెంట్ బ్యూరో ఇప్పటికే ఓ కన్ను వేసింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా అటు లా అండ్ ఆర్డర్,ఇటు ఎస్ఈబీ సంయుక్తంగా దాడులు చేస్తోంది.
జిల్లాలో ఇప్పటి వరకు 56 కేసులు నమోదు చేసామని…..42 మందిని అరెస్ట్ చేసామని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోస్టర్స్ ను ఎస్పీ విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో ఏఏస్పీ సత్య నారాయణరావు,ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, దిశ డీఎస్పీ పాల్గొన్నారు.
అక్రమ మద్యం లాంటి విషయాలను పోలీసులకు చెప్పాలనుకునేవారు,,08922-274865 నెంబర్ కు గాని లేదా 9440902363 నెంబర్ కు సమాచారం ఇవ్వొచ్చని ..ఫిర్యాదు దారిని నెంబర్ గోప్యంగా ఉంచుతామని ఎస్పీ ఈ సందర్బంగా తెలియ చేసారు.