చత్తిస్ ఘడ్ రాష్ట్రం గరియాబాద్ అటవీప్రాంతంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టు దళానికి జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఎదురు కాల్పులు జరిగిన స్థలంలో ఒక 303 తుపాకీ తోపాటు సాహిత్యం, కొంత మందుగుండు సామాగ్రి, దుస్తులు, కొన్ని వస్తువులు లభించాయని పోలీసులు తెలిపారు. పారిపోయిన మావోయిస్టుల కోసం ప్రత్యేక పోలిస్ బలగాలు గాలింపు చేపట్టాయి.