37.2 C
Hyderabad
April 26, 2024 21: 38 PM
Slider నల్గొండ

మహనీయుల విగ్రహాలకే రక్షణ కల్పించలేరా?

#BCStudents

మహనీయుల విగ్రహాలకు రాష్ట్రంలో, దేశంలో రక్షణ కరువైందని, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతపల్లి సతీష్ గౌడ్ అన్నారు.

బుధవారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ అర్బన్ జిల్లాలోని ఉర్సు కరిమాబాద్ లో శుక్రవారం కొందరు గుర్తు తెలియని దుండగులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ద్వంసం చేయడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మహనీయుల విగ్రహాలపై దాడులు చేయడం సిగ్గుచేటని, పూలే విగ్రహం ధ్వంసం వెనుక ఉన్న దుండగులను గుర్తించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. మహనీయుల విగ్రహాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు.

ఉర్సు కరిమాబాద్ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నియోజకవర్గం అధ్యక్షులు తోటపల్లి మల్లేష్, కకునూరి శంకర్, ఎరుకాల రామకృష్ణ, వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మిగనూరు మార్కెట్‌లో భారీగా పతనమైన టమాట ధర

Bhavani

బాబూ జగ్జీవన్ రామ్ కు ఎమ్మెల్యే కాలేరు ఘన నివాళి                                        

Satyam NEWS

కాకినాడలో పోలీసు అమర వీరులకు ఘన నివాళులు

Satyam NEWS

Leave a Comment