37.2 C
Hyderabad
May 2, 2024 12: 54 PM
Slider ప్రకాశం

మార్కాపురం జిల్లా సాధనే మా లక్ష్యం

#markapuram

మార్కాపురం జిల్లా సాధనే మా లక్ష్యమని జిల్లా సాధించే వరకు ఉద్యమం ఆపబోమని మార్కాపురం జిల్లా సాధన సమితి జెఎసి వైస్ చైర్మన్ ఇమ్మడి కాశీనాథ్, కోశాధికారి వక్కలగడ్డ మల్లిఖార్జున్ అన్నారు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో జెఎసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్షలు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వేశపోగు సుదర్శన్ నాయకత్వం వహించి కొనసాగించారు.

ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్, వక్కలగడ్డ మల్లిఖార్జునులు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి సరైనది కాదని, మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అడ్డుపడుతున్నదెవరో అందరికి తెలుసని అలాంటివారికి రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

జిల్లా సాధన సమితి కో – కన్వీనర్లు అందె నాసరయ్య, దగ్గుబాటి సోమయ్య, వేశపోగు సుదర్శన్, తిరుమలశెట్టి వీరయ్య, గుంటు రత్న కుమార్’లు మాట్లాడుతూ జిల్లాలో ప్రాంతాల కతీతంగా కులమతాలకతీతంగా వర్గ వైషమ్యాలు లేకుండా జిల్లా ప్రజానీకం అందరూ మార్కాపురం జిల్లా చేయాలని కోరుతుంటే ఈ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎందుకు పట్టదని ప్రశ్నించారు.

ఊపిరి ఉన్నంత వరకు ఉద్యమం కోసం పోరాడి జిల్లా సాధిస్తామని అన్నారు. దీక్షాపరులకు ఇమ్మడి కాశీనాథ్, వేశపోగు సుదర్శన్ గుంటు రత్నకుమార్,లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో వి.కావ్య, పులుకూరి రత్న, వి.సందీపిక, జి.ఆదెమ్మ, జి.మరియమ్మ, మార్తమ్మ, బాలనాగమ్మ, కవలకుంట్ల దీపక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయండి

Satyam NEWS

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం

Sub Editor

పెంచిన పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలపై కాంగ్రెస్ పార్టీ నిరసన….

Satyam NEWS

Leave a Comment