మంత్రి కే.టి.ఆర్ పి.ఏ శ్రీనివాస్ అని చెబుతూ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో సిబ్బందిని బెదిరించి పనులు చేయించుకుంటున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరిలో నివసించే కార్తికేయ, లాలాపేట్ లో నివసించే ఫెడ్రిక్ రెడ్ హాండెడ్ గా దొరికినట్లు పోలీసులు తెలిపారు.
కొన్ని రోజుల క్రితం తన కొడుకుకి వైద్యం చేయించడానికి డబ్బులు లేక శ్రీరాముల రాజు అనే వ్యక్తి కార్తికేయని సంప్రదించగా , తాను మంత్రి కే.టి.ఆర్ పీ.ఏ శ్రీనివాస్ అని చెబుతూ హాస్పటల్ కి పోన్ చేసాడు కార్తికేయ, రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఇపిస్తానని హాస్పిటల్ కి ఫేక్ పత్రాలు ఇచ్చాడు. వైద్యం పూర్తి అయ్యాక పత్రాలు ఫేక్ అని తెలవడంతో బాదితుడు ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసిన ఘటకేషర్ పోలీసులు మల్కాజిగిరి ఎస్.వో.టి సహాయంతో ఇద్దరు నిందితులను అదుపులో తీసుకున్నారు. గతంలో కూడా కార్తికేయ పై నల్గొండ 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇదే కేసు నమోదు అయినట్లు మల్కాజిగిరి డి.సి.పి రక్షిత మూర్తి తెలిపారు. నిందితులు వద్ద నుంచి 1 లక్ష 75వేలు నగదు, 3 మొబైల్ ఫోన్స్ ముఖ్యమంత్రి కార్యాలయం ఫేక్ పత్రాలను స్వాదీనం చేసుకుని నిందితులను రిమాండ్ కి తరలిస్తునట్లు తెలిపారు.