తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండు దశాబ్దాల ఆవిర్భావ దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల మధ్య ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. మండల కేంద్రంలోని ఎస్సీ వాడలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
అనంతరం మహిళలకు పరిశుద్ధ కార్మికులకు కు రెండు వందల రూపాయలు మాస్క్ లను అందజేశారు. అదేవిధంగా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీలో గ్రామస్తులకు పనికి ఆహార పథకం కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు. వెల్దండ మండల కుందారం తాండా ఎంజీ తండా గ్రామ పంచాయతీలలో గ్రామస్తుల కూరగాయలు మాస్క్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.