రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు ముందుకు సాగాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పాలనకు ఆకర్షితులై సీఎం కేసిఆర్ నాయకత్వాన్ని బలపరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అతి త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర పార్టీలు నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు భారీగా ఉంటాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు నేతలందరూ నిత్యం అందుబాటులో ఉండాలని, పార్టీ గెలుపే లక్ష్యంగా ఓటర్లను చైతన్య పరచాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై చేయాలని ఈ సందర్భంగా నేతలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
previous post