అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ , తెరాస సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. బుధవారం మల్లాపూర్ డివిజన్ కేఎల్ రెడ్డి నగర్ లో బెంగాల్ ఈస్టర్న్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాళీ మాత మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ , తెరాస సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బెంగాల్ ఈస్టర్న్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.కే. రాను, జనరల్ సెక్రెటరీ కే కర్మాకర్,అసిస్టెంట్ సెక్రటరీ రాజేష్ తాలూక్ దార్ , సెక్రెటరీ సందీప్ మజిహి , ప్రతాప్ జైన , నాచారం కార్పొరేటర్ శాంతి , సాయిజన్ శేఖర్ , కటార్ల భాస్కర్ , సంతు యాదవ్, కిషన్ సింగ్ మరియు సుగుణాకర్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి