కార్మిక హక్కులను కాపాడుకోవడం పోరాటం చేయాలని మాజీ కార్పొరేటర్ అంజయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కోక కోల కంపెనీ ఎదురుగా తెరాస కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి బురుగు మారుతి రావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరే టర్ గోల్లూరు అంజయ్య మేడే సందర్భంగా జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ స్వామి, చక్రవర్తి, చారి , కుంటి కృష్ణ, రఘు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి