38.2 C
Hyderabad
April 29, 2024 14: 10 PM
Slider ముఖ్యంశాలు

కార్మిక దినోత్సవం మేడే జయప్రదం చేయండి: ఐ ఎన్ టి యు సి

#intuc

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో శుక్రవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మే 1వ,తేదీన నిర్వహించే కార్మిక దినోత్సవం మేడే వేడుకల్లో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐ ఎన్ టి యు సి ఎల్లప్పుడూ అండగా ఉంటూ తోడ్పాటు అందిస్తుందని అన్నారు.

మేడే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,బూతు సంఘాల అధ్యక్షులు,ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనార్టీ సంఘ నాయకులు,వార్డు ముఖ్యులు మహిళా సంఘం నేతలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు ఉదయం 9 గంటలకు పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరాలని,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి ఒక్కరూ పాల్గొని మేడే ను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి,దొంగరి వేంకటేశ్వర్లు,మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,బాచిమంచి గిరిబాబు,మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,3వ,వార్డు సభ్యుడు కోతి సంపత్ రెడ్డి,ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, మాజీ ఎంపిటిసి ముశం సత్యనారాయణ,ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మేళ్ళచెరువు ముక్కంటి,పాశం రామరాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి యడవల్లి వీరబాబు,ఉపాధ్యక్షుడు గొట్టెముక్కల రాములు,పోతనబోయిన రాంమూర్తి, కరుణాకర్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి,చలిగంటి జానయ్య, చింతకాయల రాము,ముస్తఫా,కస్తాల సైదులు,సులువ చంద్రశేఖర్,పోతుల జ్ఞానయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నేషనల్ అచీవ్ మెంట్ సర్వే (నాస్) పరీక్షా కేంద్రాల సందర్శన

Satyam NEWS

కామారెడ్డిలో బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలు

Bhavani

వ్యాయామ ఉపాధ్యాయుడు డా. మోహన్ కు మరో అంతర్జాతీయ పురస్కారం

Satyam NEWS

Leave a Comment