38.2 C
Hyderabad
April 28, 2024 22: 19 PM
Slider నల్గొండ

జర్నలిస్టులపై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

#mlasaidireddy

సూర్యాపేట జిల్లాలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోలా నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డికి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో,జిల్లాలో జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. 

శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సిఎం కెసిఆర్ కు వివరిస్తానని అన్నారు. అదే విధంగా జనవరి 6న,హుజూర్ నగర్ పర్యటనకు రానున్న మంత్రి కెటిఆర్ తో జర్నలిస్టుల సమస్యలు మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేద్దామనిన్నారు.   ప్రైవేటు కార్పోరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డులు సక్రమంగా అమలయేల చర్యలు తీసుకుంటామని సైదిరెడ్డి అన్నారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు, ఇళ్ళు,ఇళ్ళ స్థలాలు మంజూరు కోసం సిఎం కెసిఆర్,మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చినారు.

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకంగా ఉన్నదని,వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని సైదిరెడ్డి అన్నారు.గత ప్రభుత్వాల కన్నా మిన్నగా జర్నలిస్టులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించారు.

ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన వారిలో టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ జిల్లా కార్యదర్శి టి వి ఎల్,  ఆర్గనైజే సెక్రటరీ బసవోజు శ్రీనివాస చారి, దాడుల నిరోధక కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జానీ పాషా,ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కితా రామనాథం,ప్రెస్ క్లబ్ జిల్లా అధికార ప్రతినిధి ఆర్ పి గౌడ్, దాడుల నియంత్రణ కమిటీ జిల్లా అధికార ప్రతినిధి పెందుర్తి భాస్కర్,యూనియన్ అధికార ప్రతినిధి పిల్లలమర్రి శ్రీనివాస్, దాడుల నియంత్రణ కమిటీ జిల్లా కార్యదర్శి దేవరం రాంరెడ్డి,జిల్లా ప్రచార కార్యదర్శి దేవరం వెంకటరెడ్డి,దాడులు నిరోధక కమిటీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేనంకొండ శేషం రాజు,యూనియన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొమరాజు అంజయ్య,దాడులు నిరోధక కమిటీ జిల్లా అధికార ప్రతినిధి చిట్టిపోతుల రమేష్,ప్రెస్ క్లబ్ జిల్లా కార్యదర్శి ఇట్టిమల్ల రామకృష్ణ తదితరులు ఉన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

స్వచ్ఛంద బందులో వైన్ షాపులకు మినహాయింపు ఎందుకు

Satyam NEWS

మొగుళ్లపల్లి ఉపేందర్ కు ఉగాది పురస్కారం

Satyam NEWS

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు

Satyam NEWS

Leave a Comment