33.7 C
Hyderabad
April 29, 2024 00: 10 AM
Slider గుంటూరు

ఈ నెల 22న పల్నాడు జిల్లా మినీ మహానాడు

#Mini Mahanadu

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును ఈ నెల 22న ఉదయం 10:00 గంటలకు పట్టణంలోని జమిందార్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న మినీ మహానాడును విజయవంతం చేయాలనీ నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు టీడీపీ నాయకులు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా

డా౹౹చదలవాడ మాట్లాడుతూ పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు సారథ్యంలో టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మహానేత,అన్న నందమూరి తారకరామారావు గారి శత జయంతిని పురస్కరించుకొని కార్యకర్తలు,అభిమానుల మధ్య ప్రతి ఏటా రెండు రోజులపాటు మహానాడును పండుగలా నిర్వహిస్తున్నామన్నారు.మహానాడుకు మందు జిల్లా స్థాయిలో మినీ మహానాడును జరుపుకొని అనంతరం రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో జరిగే మహానాడులో

పాలుపంచుకుంటున్నాన్నారు.వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక తీరు,క్షేత్రస్థాయిలో టీడీపీ పార్టీని బలోపేతం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు.

కావున గ్రామ,మండల,పట్టణ, నియోజకవర్గ,జిల్లా,రాష్ట్ర కమిటీల్లో ఉన్న సభ్యులు,క్రియాశీల కార్యకర్తలు,వారి సభ్యత్వ కార్డుతో హాజరుకావాలన్నారు.పండుగలా జరుపుకునే మినీ మహానాడుకు పార్టీలోని ప్రతి కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Related posts

సేకరించిన వరిధాన్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వైనం

Satyam NEWS

రెడ్ ఎలర్ట్: నరసరాపుపేటలో కరోనా పాజిటీవ్

Satyam NEWS

తవ్వి వదిలేసిన రోడ్లతో తంటాలు పడుతున్న ప్రజలు

Satyam NEWS

Leave a Comment