28.7 C
Hyderabad
April 28, 2024 05: 07 AM
Slider హైదరాబాద్

తవ్వి వదిలేసిన రోడ్లతో తంటాలు పడుతున్న ప్రజలు

#BJPAmberpet

ఇటీవల వర్షాలు వరదలతో ఇబ్బంది పడిన ప్రజలు జీహెచ్ఎంసి అధికారుల తీరుతో ఇంకా బాధలు పడుతూనే ఉన్నారు. హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ డివిజన్ లో జీహెచ్ ఎంసి అధికారుల తీరుకు నిరసనగా నేడు బిజెపి ధర్నా చేసింది.

 తవ్వి వదిలేసిన అయ్యప్ప గుడి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని బిజెపి అధ్యక్షుడు చుక్క జగన్ ఆధ్వర్యంలో అయ్యప్ప గుడి దగ్గర బుధవారం ధర్నా చేశారు.

ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన నగర మాజీ బీజేపీ అధ్యక్షుడు బి. వెంకట రెడ్డి మాట్లాడుతూ బాగ్ అంబర్ పేట్ డివిజన్ లోని అయ్యప్ప గుడి రోడ్డు, మల్లికార్జున్ నగర్ రోడ్డు, తురాబ్ నగర్ రోడ్డు, జంజం మసీద్ రోడ్లు చాలా నెలలుగా తవ్వి పెట్టి రోడ్లు వేయకుండా వదిలేశారని దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

 ముఖ్యంగా అయ్యప్ప గుడి రోడ్డు లో గుడికి వచ్చే అయ్యప్ప స్వాములు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని కాబట్టి జిహెచ్ఎంసి అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

లేకపోతే జిహెచ్ఎంసి కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కృష్ణ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాంబ శివ గౌడ్,  స్టేట్ కౌన్సిల్ సభ్యులు దత్తు ముదిరాజ్, అచ్చి ని రమేష్, జి మల్లేష్,

రాష్ట్ర పబ్లిసిటీ సెల్ జాయింట్ కన్వీనర్ రంగం పల్లి రాజు,  బిజెపి అసెంబ్లీ కన్వీనర్ E. అజయ్ కుమార్,  ప్రకృతి వైపరీత్యాల నగర సెల్ కన్వీనర్ కె చంద్రశేఖర్, పర్యావరణ నగర సెల్ కన్వీనర్ మిర్యాల శ్రీనివాస్, డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి కోడూరు సురేష్, డి భాస్కర్, కె శ్రీహరి,  మంత్రి విజయ్ కుమార్,

గోవింద అర్జున్, ఎల్. శ్రీనివాస్, పరమేష్ యాదవ్,E.బాలకృష్ణ, భాస్కర్, సుధాకర్, కౌశిక్ గౌడ్, యాదగిరి, హేమంత్, మహిళా నాయకురాలు సునంద, కవిత, సునీత, వరలక్ష్మి, శారదా, పద్మజా, యాదమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.

Related posts

స్పందన ద్వారా బాధితుల నుంచి 40 ఫిర్యాదులు స్వీకరణ

Satyam NEWS

మతకలహాలు సృష్టించే ఫేక్ వార్తలను కట్టడి చేయాలి – Fake news in social media telugu

Satyam NEWS

ద్వారకా తిరుమలలో నిత్యాన్నదానం పున:ప్రారంభం

Satyam NEWS

Leave a Comment