బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మహబూబ్ నగర్ పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో ఉన్న సిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వీడియో జర్నలిస్ట్ రాజును మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రాజు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
అత్యవసరం అయితే హైదరాబాద్ తరలించి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు సైతం ఏర్పాట్లు చేయాలని కోరారు. రాజు వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని వైద్యులకు తెలిపారు. రాజు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. రాజు కుటుంబానికి అండగా ఉన్నందుకు మంత్రికి వీడియో జర్నలిస్టులు శీను, సంతోష్, అంజి, శేఖర్, నర్సింగ్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.