40.2 C
Hyderabad
May 2, 2024 15: 42 PM
Slider శ్రీకాకుళం

ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం మంత్రి ధర్మాన అసమర్ధత

#dharmana

ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావేనని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. ఎంతో కాలంగా మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర కోసం ఏం చేశారో ముందు చెప్పాలని ఆయన అన్నారు. అమరావతి రాజధాని రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర కోసం తన రాజకీయ జీవితంలో పదవులు అనుభవించడం తప్ప చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు.

విశాఖ రాజధాని కోసం కాదు, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించండి అని బాలకోటయ్య పిలుపునిచ్చారు. మూడు రాష్ట్రాలుగా విడిపోయి మూడు సంపూర్ణ రాజధానులు కట్టుకుందాం అని ఆయన అన్నారు. మూడు రాజధానులు కావాలంటే రాష్ట్రం మూడు రాష్ట్రాలుగా చీలిపోవాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తో మాట్లాడి మూడు రాష్ట్రాల బిల్లు పెట్టండి స్వాగతిస్తాం అని ఆయన అన్నారు. అమరావతిని వ్యతిరేకించే మంత్రి ధర్మాన ప్రసాదరావు దమ్ముంటే, మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయన రాజీనామాను స్వాగతిస్తామని బాలకోటయ్య అన్నారు.

Related posts

అక్రమాలను వ్యతిరేకిస్తాం….అభివృద్ధిని స్వాగతిస్తాం

Satyam NEWS

సామిల్ & టింబర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

క్రేన్ సంస్థల అధినేతగా లక్ష్మీకాంతరావుకు పట్టాభిషేకం

Satyam NEWS

Leave a Comment