రాష్ట్ర ఆర్థిక మంత్రి మంత్రి హరీష్ రావు కరోనా బారిన పడ్డారు. తనతో కాంటాక్ట్లో ఉన్న వాళ్లని టెస్ట్లు చేయించుకోమని మంత్రి హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతాలో కోరారు.
ఈ నెల 7 నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ స్టాఫ్ ,ఎమ్మెల్యే లకు, మీడియా ప్రతినిధులకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
ఈ రోజు అసెంబ్లీలో టెస్ట్ చేయించుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డికి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ రాగా మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది.
నిన్న ప్రగతి భవన్లో సీఎం మంత్రులతో అసెంబ్లీ సమావేశాలపై చర్చ లో పాల్గొన్నారు. అయితే జూన్ నెలలోనే తన పీఏ కి కరోనా సోకగా హరీష్ రావు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు.
సిద్దిపేటలోని ఆయన నివాసంలోని ఓ వ్యక్తిగత సహాయకుడికి కోవిడ్19 పాజిటివ్గా తేలింది. దీంతో అప్పుడు మంత్రి హరీష్ రావు హైదరాబాద్లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు.