దున్నపోతు కు గడ్డి వేసి బర్రె కు పాలు పిండితే రావు అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచాము..హోం గార్డులు, అంగన్వాడీ, ఆశా లకు జీతాలు పెంచి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాము..టీఆర్ఎస్ పార్టీకి కాకుండా బిజెపికి ఓటు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
పని చేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి..అని ఆయన పిలుపునిచ్చారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ లో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన శ్రీకాంత్ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పెద్దిరెడ్డి టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నిన్న మొన్న రాజేందర్ మాట్లాడుతూ టి ఆర్ ఎస్ పార్టీ వారు తమ నాయకులను ప్రలోభ పెడుతున్నారు అన్నాడు.
ఈ యువకులను ఎవరైనా ప్రలోభ పెట్టగలరా అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ వెంట నాయకులు ఎవరు లేరు. అతని వెనుక నాయకులు లేక పోయే సరికి ఫ్రస్టేషన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు.