33.7 C
Hyderabad
April 29, 2024 00: 29 AM
Slider ప్రత్యేకం

భావోద్వేగానికి గురైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

#kishanreddy

దేశానికి సేవ చేసే భాగ్యం అంబర్పేట్, సికింద్రాబాద్ ప్రజలే ఇచ్చారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం అంబర్పేట్ లో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అంబర్పేట్ కు వస్తే చాలా రోజుల తరువాత బిడ్డ తన తల్లి దగ్గరకు వచ్చినట్లుగా అనిపిస్తోంది అని ఆయన అన్నారు. తాను ఇప్పడు ఢిల్లీ ఉన్నాంటే అంబర్పేట్ ఆసెంబ్లీ, సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే కారణమని తెలిపారు. కేంద్ర మంత్రి ఆయినందుకు సంతోంగా లేదని.. దానికన్న అంబర్పేట్ కు దూరమయ్యాన్నన బాధ ఎక్కువగా ఉందని చెప్పారు. అంబర్పేట్ బిడ్డగా అందరూ గర్వపడేల పనిచేస్తాన్నని కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట్ తనకు తల్లిలాంటిదని ఈ ప్రాంతమే తనకు జీవం పోసిందని తెలిపారు. బీజేపీ, అంబర్పేట… నాకు రెండు కళ్లతో సమానమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబర్పేటలో గల్లీ, గల్లీ తిరిగినట్టు ఆయన గుర్తు చేశసుకున్నారు. ఇప్పుడు కూడా తిరగాలని మనసులో ఉన్నా… సమయం సహకరించడం లేదని అన్నారు. ఇప్పుడు తన బాధ్యతలు పెరిగాయని… ఢిల్లీలోనే ఉంటూ అందరిని కలుస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షంచాలని చెప్పారు. అందుకే అంబర్పేట గల్లీలో తిరుగలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. భవిష్యతులోనూ తనను ఆశీర్వాదించాలని కోరారు.

Related posts

జులై లో ప్రైవేట్ టీచర్లకి అందని ఆర్థిక సహాయం

Satyam NEWS

సినీ తారలకు జరిమానా

Sub Editor 2

పెద్ద పులి కాదు…. అది చిన్న అడవి పిల్లి….ఓకేనా..

Satyam NEWS

Leave a Comment