తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకి ఇచ్చే రెండు వేల నగదు,25 కేజీల బియ్యం సహాయం పూర్తి స్థాయిలో ప్రైవేట్ టీచర్లకు జులై నెల పూర్తి అవుతున్నా ఇంత వరకు సహాయం అందలేదని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టే నాగరాజు యాదవ్ అన్నారు.
పాఠశాలలు లేక ప్రైవేటు యాజమాన్యాలు పట్టించుకోని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం తమకు ఎంతో వెసులుబాటు కల్పించిందని,ఈ నెల అందించే 2000 రూపాయలు,25 కేజీల బియ్యం సహాయాన్ని అందిస్తే ఆర్థికంగా కుటుంబ పోషణ కొనసాగించగలమని తెలంగాణ ప్రభుత్వాన్ని గొట్టే నాగరాజు యాదవ్ కోరారు.కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సంవత్సరం కూడా పాఠశాలలు ప్రారంభం అయ్యే అవకాశం లేనందున ఈ విద్యా సంవత్సరం కూడా ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని కోరారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్