పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలు తక్షణమే ఇవ్వాలని ప్రకాశం జిల్లా దరిశి మండలం లోని గ్రామాలలో పారిశుధ్య కార్మికులు (క్లాప్ మిత్ర) డిమాండ్ చేశారు. దరిశి MPDO ఆఫీసు వద్ద వారు నిరసన తెలిపి MDO కి వినతిపత్రం సమర్పించారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు నిర్ధిష్ట వేతనవిధానం రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. నెల నెల వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, పంచాయితీలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాలని వారు కోరారు. 10 వేలు వేతనం పెంచుతూ ఇచ్చిన G.O అమలు చేయాలని వారు కోరారు. రక్షణ పరికరాలు ,యూనిఫాం ,సబ్బులు , బూట్లు , నూనె ఇవ్వాలి , రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులకు సమస్యలపై అర్జీ పంపిస్తామని , డిమాండ్స్ అమలు కోసం కృషి చేస్తామని MPDO హామీ ఇచ్చారు.
previous post
next post