చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కుటుంబ సభ్యుల పై దాడి విషయంలో అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేసిన టిడిపి కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు నేడు పరామర్శించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు తదితరులు నేడు నరసరావుపేట సబ్ జైల్లో పరామర్శించారు.
ఆ రోజు జరిగిన విషయాలను వారు తెలుసుకున్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు తమను అరెస్టు చేసి వేధిస్తున్నారని వారు తెలుగుదేశం నాయకులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయ సహాయం అందించాలని వారు వేడుకున్నారు. వైసిపిలో అంతర్గత విభేదాల కారణంగా గొడవలు జరిగితే తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు.