గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరద ముంచెత్తుతుంది. మూసి ఉదృతంగా ప్రవహిస్తుంది. హైదరాబాద్ అంబర్ పెట్ లోని మూసారాం బాగ్ బ్రిడ్జి మూసి పరివాహక ప్రాంతాన్ని మంత్రి కేటీఆర్ మలక్ పేట ఎమ్మెల్యే బల్లాల, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు స్థానిక కార్పొరేటర్ లతో కలిసి పర్యవేక్షించారు. మూసి ఉధృతి పై చేపడుతున్న సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలోనే ముసరాంబాగ్ బ్రిడ్జి నిర్మాణానికి 52 కోట్ల నిధులు కేటాయించామని వర్షాలు తగ్గుముఖం పండిన వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతామని మంత్రి తెలిపారు.
previous post
next post