29.7 C
Hyderabad
April 29, 2024 07: 59 AM
Slider ప్రత్యేకం

యూకే లో మంత్రి కేటీఆర్ పర్యటన

#KTR

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి యూకే ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించే ల‌క్ష్యంతో కేటీఆర్ యూకే ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయా దేశాల పారిశ్రామిక‌వేత్త‌లు, వాణిజ్య సంఘాల‌తో భేటీ కానున్నారు.

రాష్ట్రంలో పెట్టుబ‌డుల అనుకూల‌త‌ల గురించి కేటీఆర్ వివ‌రించ‌నున్నారు. ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు కేటీఆర్ యూకేలో ప‌ర్య‌టన కొనసాగనుంది గ‌తేడాది మే 18 నుంచి 22 వరకు కేటీఆర్ లండన్‌లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే.

లండన్‌లో భారత హైకమిషన్‌ సమావేశంతోపాటు ప్రవాస భారతీయులు, యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Related posts

దైవదర్శనానికి వెళుతూ 14 మంది మృత్యువు ఒడిలోకి

Satyam NEWS

కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి

Satyam NEWS

పేద బ్రాహ్మణుడి కుటుంబానికి కేవీ రమణ సాయం

Satyam NEWS

Leave a Comment