భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ నుండి బాంబే కాలనీ వరకు DMFT నిధులు రూ.3.50 కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. మణుగూరులోని సింగరేణి రోడ్డు నుండి PR రోడ్డు వరకు DMFT నిధులు రూ.1.75 కోట్లతో నిర్మించనున్న BT (బ్లాక్ టాప్) రోడ్డు నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తోబాటు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా, ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.