జగన్ ప్రభుత్వం అనుకున్న ప్రకారం నవరత్నాల పధకాలలో భాగంగా బడి ఈడు పిల్లలకు “అమ్మ ఒడి” పధకం లో భాగంగా మూడో విడత డబ్బుల పంపిణీ కి శ్రీకారం చుట్టారు.
సిక్కోలు లో సీఎం జగన్ ఈ కార్యక్రమం ప్రారంభించగా..పక్కనే ఉన్న విజయనగరం జిల్లా నుంచీ జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తో పాటు స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఇతర ఎమ్మెల్యేలైన శంబంగి, అప్పలనరసయ్య , అలాగే ఎమ్మెల్సీ కూడా హాజరయ్యారు.
అయితే.. కుడివైపు ఎల్.సీ.డీ ద్వారా సిక్కోలు సీఎం జగన్ కార్యక్రమాన్ని కలెక్టరేట్ లో లబ్ధిదారులైన తల్లులతో పాటు… అధికారులు వీక్షిస్తున్నారు.సరిగ్గా అప్పుడే ఎస్.కోట ఎమ్మెల్యే వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు కుర్చీ వేయాలని.. అధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల..అక్కడే ఉన్న దఫేదారుకు చెప్పారు.
హాడావుడిలో తొందరలో ఆ దఫేదారు కాస్త తడబడ్డాడు.దీంతో.. అటు ఎమ్మెల్యే కుర్చీ లేకపోగా నిల్చోవడం..చూసి న ఎమ్మెల్యే కోలగట్ల.. ఒక్కసారిగా లేచి..ఏం..ఇనబడటం లేదా…? ఒక ఎమ్మెల్యే కుర్చీ లేకుండా నిల్చుని ఉండటం నీకు కనిపించటం లేదా..? నేను చెప్పినా యెయ్యలేకపోవడమేంటి..? అని గట్టిగా కేకలేసారు..!
కలెక్టరేట్ హాలులో సీఎం జగన్ కార్యక్రమం..పెద్ద సౌండ్ తో అందరూ వీక్షిస్తున్నారు.. కానీ ఆ దృశ్యం అక్కడున్న మీడియా కంట పడింది. మరీ ముఖ్యంగా సత్యం న్యూస్. నెట్ కు కనిపించడంతో వెంటనే తన కెమారాలో బంధించారు.