37.2 C
Hyderabad
May 2, 2024 13: 08 PM
Slider విజయనగరం

విజయనగరంలో ‘అమ్మ ఒడి’కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కు కోపం వచ్చింది..!

#kolagatla

జగన్ ప్రభుత్వం అనుకున్న ప్రకారం నవరత్నాల పధకాలలో భాగంగా బడి ఈడు పిల్లలకు “అమ్మ ఒడి” పధకం లో భాగంగా మూడో విడత డబ్బుల పంపిణీ కి శ్రీకారం చుట్టారు.

సిక్కోలు లో సీఎం జగన్ ఈ కార్యక్రమం ప్రారంభించగా..పక్కనే ఉన్న విజయనగరం జిల్లా నుంచీ జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తో పాటు స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఇతర ఎమ్మెల్యేలైన శంబంగి, అప్పలనరసయ్య , అలాగే ఎమ్మెల్సీ కూడా హాజరయ్యారు.

అయితే.. కుడివైపు ఎల్.సీ.డీ ద్వారా సిక్కోలు సీఎం జగన్ కార్యక్రమాన్ని కలెక్టరేట్ లో లబ్ధిదారులైన తల్లులతో పాటు… అధికారులు వీక్షిస్తున్నారు.సరిగ్గా అప్పుడే ఎస్.కోట ఎమ్మెల్యే వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు కుర్చీ వేయాలని.. అధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల..అక్కడే ఉన్న దఫేదారుకు చెప్పారు.

హాడావుడిలో తొందరలో ఆ దఫేదారు కాస్త తడబడ్డాడు.దీంతో.. అటు ఎమ్మెల్యే కుర్చీ లేకపోగా నిల్చోవడం..చూసి న ఎమ్మెల్యే కోలగట్ల.. ఒక్కసారిగా లేచి..ఏం..ఇనబడటం లేదా…? ఒక ఎమ్మెల్యే కుర్చీ లేకుండా నిల్చుని ఉండటం నీకు కనిపించటం లేదా..? నేను చెప్పినా యెయ్యలేకపోవడమేంటి..? అని గట్టిగా కేకలేసారు..!

కలెక్టరేట్ హాలులో సీఎం జగన్ కార్యక్రమం..పెద్ద సౌండ్ తో అందరూ వీక్షిస్తున్నారు.. కానీ ఆ దృశ్యం అక్కడున్న మీడియా కంట పడింది. మరీ ముఖ్యంగా సత్యం న్యూస్. నెట్ కు కనిపించడంతో వెంటనే తన కెమారాలో బంధించారు.

Related posts

ఉపరాష్ట్రపతిపై దారుణ వ్యాఖ్యలు చేసిన ఏపి సిఎం జగన్

Satyam NEWS

మున్సిపల్ ఎన్నికలకు విజయనగరం పోలీసుల నాకాబందీ

Satyam NEWS

806 మంది పాస్ట‌ర్ల‌కు నారా లోకేష్ క్రిస్మ‌స్ కానుక

Bhavani

Leave a Comment