40.2 C
Hyderabad
April 26, 2024 13: 35 PM
Slider నల్గొండ

కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేయడం మరచిపోయిన ప్రభుత్వం

#DSRTrust

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయడంలేదని, దీనివల్ల ఎంతో మందికి అన్యాయం జరుగుతోందని DSR ట్రస్ట్ చైర్మన్ బాబు రావు అన్నారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వృద్ధులు వికలాంగులు, మహిళలు, వితంతువులకు తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.

గత రెండు సంవత్సరాల నుండి దరఖాస్తు చేసుకున్న వారిని పట్టించుకునే పరిస్థితి లేదని,వెంటనే వారికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోల్లపూడి కళ్యాణ్, దగ్గుపాటి రాజేష్, మామిడి అశోక్ కుమార్,మామిడి రాజేష్, దగ్గు పాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

చెప్పరా….

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణ ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

Satyam NEWS

నిరసన తెలిపే వారిని తుపాకితో బెదిరిస్తారా?

Satyam NEWS

Leave a Comment