40.2 C
Hyderabad
April 29, 2024 17: 08 PM
Slider విజయనగరం

పైడితల్లి పండగకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఎమ్మెల్యే కోలగట్ల

#kolagatla

విజయనగరంలోని ఒంటి తాడి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యే కోలగట్ల కు సాదర స్వాగతం పలికారు.

అనంతరం ఎమ్మెల్యే కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ పదమూడేళ్ల తరువాత జరిగే పైడితల్లమ్మ జాతర ను అందరూ సమన్వయంతో , రాజకీయాలకు అతీతంగా, కలసికట్టుగా అమ్మ వారి పండుగ నిర్వహించడం అభినందనీయమన్నారు. అమ్మ వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని అభిలషించారు.

అమ్మవారి ఉత్సవాలను అత్యంత వైభవంగా, ఆనందకరంగా, వీటి అగ్రహారం పెద్దలు, ప్రజలు , యువత కలసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడం అభినందనీయమన్నారు. అధికారులు కూడా సమన్వయంతో జాతరను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

Related posts

బ్యాంకును ముట్టడించిన వైసీపీ నాయకులు

Satyam NEWS

కంప్లయింట్: డబ్బూ డబ్బూ ఎక్కడకు వెళ్లావు?

Satyam NEWS

గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలి

Satyam NEWS

Leave a Comment