40.2 C
Hyderabad
April 28, 2024 17: 12 PM
Slider ఆదిలాబాద్

పేదింటి బిడ్డ ఎంబిబిఎస్ కు సాయం అందించిన ఎమ్మెల్యే కోనప్ప

#konerukonappa

ఎంబిబిఎస్ సీటు తెచ్చుకున్న ఒక పేదింటి బిడ్డకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అండగా నిలిచారు. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన చాహిరే జనార్దన్, రేఖ ల కుమార్తె కరిష్మా చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి చదివి నీట్ 2021 ఎంట్రన్స్ రాసింది.

ఆలిండియా లెవల్ లో 471 మార్క్స్ తో 1,11,479 ర్యాంక్ సాధించింది. కౌన్సిలింగ్ లో ఆమెకు ఎం బి బి ఎస్ సీటు వచ్చింది. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ లో ఉచితంగా సీట్ లభించింది. అయితే ముందుగా లక్ష రూపాయల వరకూ చెల్లించాల్సి ఉంది.

ఈ డబ్బు ఎక్కడ నుంచి తీసుకురావాలో ఆ తండ్రికి అర్ధం కాలేదు. తల్లిదండ్రుల పరిస్థితి ఆ అమ్మాయి ఆశల మీద నీళ్లు చల్లింది. అయితే ఎం బి బిఎస్ చదవాలనే కోరికతో ఉన్న కరిష్మాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. అయితే సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పందించారు. కరిష్మా చదువులకు ఖర్చులు భరిస్తానని, తన వెంట తీసుకెళ్లి రేపు కళాశాలలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు.

Related posts

వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ కు అపూర్వ స్వాగతం

Satyam NEWS

గంగిరెడ్డి కి వైసీపీ కి సంబంధం లేదా?

Satyam NEWS

వెపన్ పట్టాల్సిన ఖాకీ చేతులు ఏం పట్టాయో తెలుసా…?

Satyam NEWS

Leave a Comment