హైదరాబాద్ నగరంలో మళ్లీ టీఆర్ఎస్ గెలవాల్సిన అవసరాన్ని వివరిస్తూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నేడు మిర్యాలగూడా ఎమ్మెల్యే భాస్కరరావుతో కలిసి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వెంగళరావు నగర్ లో విస్త్రత పర్యటన జరిపారు.
వెంగళరావు నగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి దీపు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి ని అడ్డుకోడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ తెలిపారు.
స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు తాము 24 గంటలూ అందుబాటులో ఉంటున్నామని, కరోనా సమయం నుంచి పండుగల సీజన్ వరకూ అందరిని ఆదుకుంటున్నామని ఎమ్మెల్యే గోపీనాథ్ వివరించారు.
బస్తీలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలూ పని చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
వేరే పార్టీ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించి అదృశ్యం అవుతారని అందుకే ఓటర్లు ఆలోచించి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఆయన కోరారు.