సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామ పంచాయతీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ మేళ్లచెర్వు మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, అందులో భాగంగానే పాలిటెక్నిక్ కళాశాల, ESI హాస్పిటల్, గురుకుల పాఠశాల మంజూరు చేయించానని అన్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు.
మిషన్ మిషన్ భగీరధ పైప్ లైన్ నిర్మాణానికి అదనంగా 33 కోట్లు చేయించానని, నవంబర్ చివరి నాటికి మిషన్ భగీరధ నీరు మారుమూల గ్రామాలకు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు.
అనంతరం రామాపురంలో గ్రామపంచాయితీ నిధుల నుంచి నిర్మిస్తున్న SC కమ్యూనిటి హాల్ నిర్మాణానికి శంఖు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బసవయ్య , సర్పంచ్ అన్నపూర్ణమ్మ, ఎంపిటిసి కొండల్ , సైదేశ్వర్ రావు, వీరనాగిరెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.