గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన గోవిందరావుపేట మండలం తారక రామ కాలనీ కి చెందిన వక్కల శంకర్ కుటుంబాన్ని ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క నేడు పరామర్శించారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎల్లవేళలా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వారి కుటుంబాన్నీ ఓదార్చి ఏ ఆపద వచ్చిన ఆదుకుంటామని వారికి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, జెట్టి సోమయ్య, సర్పంచ్ లావుడియా లక్ష్మీ- జోగనాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షడు భూక్య రాజు, రామచంద్రపు వెంకటేశ్వర్లు, సింగపురం కృష్ణ, మద్దినేని వినయ్ తదితర నాయకులు పాల్గొన్నారు.