కేంద్ర మాజీ, టీడీపీ పోలిట్ బ్యూరో నేతృత్వంలో సమావేశం…!
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై ప్రతిపక్ష టీడీపీ చర్చలు నిర్వహిస్తోంది.అందులో భాగంగా విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో ఆ పార్టీ విజయనగరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధిగా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు అందరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఓటరుగా ఉన్న ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాను వారికి వివరించాలన్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం రాష్ట్రానికి ఇప్పుడు ఎంత అవసరమో తెలిసేలా వారిని చైతన్య పరిచేలా అందరు ప్రచారం చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డా. వేపాడ చిరంజీవి విజయానికి పార్టీ పరంగా అలాగే ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో గల రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గ, పట్టణ,మండల స్థాయి నాయకులు, వార్డు,గ్రామ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్పొరేటర్, ఎంపిటిసి, సర్పంచులు మరియు అభ్యర్థులు క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.