హుజుర్ నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, LRS సర్వేలపై నియోజకవర్గ MLA శానంపూడి సైదిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మున్సిపల్ అధికారులతో మరియు కౌన్సిలర్లు పాల్గొన్న ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హుజుర్ నగర్ మున్సిపాలిటీ ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రోడ్ల సమస్యల గురించి ఆయన ప్రస్తావిస్తూ త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వ G.O విడుదల అవుతున్నదని తెలిపారు.
రోడ్ల మరమ్మతులు సాధ్యమైనంత త్వరలో జరుగుతాయని అన్నారు. LRS పై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి, అవగాహన కల్పించే చర్యలను చేపట్టే బాధ్యత ప్రతి కౌన్సిలర్ బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.