సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను శనివారం హుజూర్ నగర్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో జాగృతి రాష్ట్ర నాయకులు కోట నర్సింహా రావు రోగులకు పండ్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కొరకు ఎంతో కృషి చేశారని అన్నారు.కరోనా సమయంలో గల్ఫ్ దేశాల్లో, వివిధ రాష్ట్రాలలో ఉండి ఇబ్బందులు పడుతున్న వారిని స్వంత ఖర్చులతో స్వస్థలాలకు రప్పించి ఆదుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా కో-కన్వీనర్లు మస్తాన్, గోవర్దన్,హుజూర్ నగర్ జాగృతి మహిళా నాయకురాలు షేక్ రహీమా, కొండలు, కె.ఎస్.ఎన్ రెడ్డి,షేక్ ముస్తఫా,నిమిషకవి తిరుపతి రావు,పద్మ తదితరులు పాల్గొన్నారు.