యూనేస్కో గుర్తింపు పొంది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించేందుకు రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ములుగు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆమెకు ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఘన స్వాగతం పలికారు. జగదీశ్వర్ ఆమెకు పుష్ప గుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్, టీఎస్ రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
previous post