మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మలాద్ ప్రాంతంలోని పాఠశాలలో లిఫ్ట్లో చిక్కుకుని 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు మరణించిన విషాదకరమైన సంఘటన జరిగింది. ఉత్తర ముంబైలోని మలాడ్లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్లో మహిళా టీచర్ జానెల్లే ఫెర్నాండెజ్ లిఫ్ట్లో చిక్కుకుని మరణించారు. ఫెర్నాండెజ్ జూన్ 2022లో పాఠశాలలో చేరారు. అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల భవనంలోని ఆరో అంతస్తులో మధ్యాహ్నం 1 గంటకు టీచర్ జానెల్లే ఫెర్నాండెజ్ క్లాస్ ముగించారు. దీని తర్వాత రెండో అంతస్తులో ఉన్న స్టాఫ్ రూమ్కి వెళ్లాలనుకున్నారు. అందుకే లిఫ్ట్ లోపలికి వెళ్లిన తర్వాత లిఫ్ట్ బటన్ నొక్కారు. అయితే డోర్ మూసేలోపే లిఫ్ట్ పైకి కదులుతూనే ఉంది. అటువంటి పరిస్థితిలో, ఆమె పాదాలలో ఒకటి లిఫ్ట్ వెలుపల మరియు ఒక పాదం లోపల ఉంది.
లిఫ్ట్ ఏడవ అంతస్థు వైపు వెళ్లడం ప్రారంభించింది. లిఫ్టులోకి ఆమె పూర్తిగా ప్రవేశించలేకపోయింది. దాంతో ఆమె అరవడం ప్రారంభించారు. ఆ తర్వాత పాఠశాల సిబ్బంది వచ్చి ఆమెను రక్షించారు. అయితే, అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం లైఫ్లైన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. లిఫ్ట్ నిర్వహణ తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.