భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లె వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా మొరంచపల్లి గ్రామం జలదిగ్భందంలో చిక్కుకుంది. ఇప్పటికే ముగ్గురు గ్రామస్థులు వరదలో కొట్టుకుపోగా ఇళ్లలోని సామాన్లు వరద పాలవుతున్నాయి.
ఊరంతా నీరు చేరడంతో ప్రజలు మిద్దెలపైకి ఎక్కి సాయం కోసం ఎదరుచూస్తున్నారు. మరోవైపు గ్రామంలోని 1500 మందిని సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు అధికారులు హెలికాఫ్టర్ సమకూర్చేందుకు యత్నిస్తున్నారు.