కరోనా కట్టడికి రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి రూ.1.75 కోట్ల నిధులను కేటాయించారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో అవసరమైన సహాయక చర్యల కోసం రూ.1 కోటి రూపాయలు కేటాయించారు. కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు అవసరమైన సహాయక చర్యల కోసం రూ.75 లక్షల రూపాయలు కేటాయించారు.
ఈ నిధులతో మాస్కులు, సాని టైజర్స్, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు తదితర సహాయక చర్యలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిధుల నుంచి ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజల ఆరోగ్యం కోసమే ఉపయోగపడేలా చూడాలని అధికారులకు ఎంపీ సూచించారు.