కృష్ణా జిల్లా మైలవరం లో గంజాయి వాడకం విచ్చలవిడిగా సాగుతున్నది. మైలవరం లో ఓ విద్యార్థి వద్ద గంజాయి ఉందన్న సమాచారం తో పోలీసులు ఆ విద్యార్థి ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
మైలవరం లో కొంత కాలంగా గంజాయి ని విద్యార్థులు, రోజువారీ కూలి లకు అతను విక్రయిస్తున్న ట్లు సమాచారం. విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సి ఐ.పి.శ్రీను, ఎస్ఐ.కే.ఈశ్వరరావు తెలియజేశారు.