సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కారములు అంటూ సీనియర్ నాయకుడు, కాపు కులస్తుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న కీలకవ్యక్తి ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ రాజకీయ మలుపులు తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. కాపు జాతికి అన్యాయం చేయవద్దంటూ ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
ఆ లేఖ పూర్తి పాఠం: ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారములు, మీరు అడిగిన వారికి అడగని వారికి హామీలు ఇవ్వని, ఇచ్చిన వాటికి దానాలు చేసి దాన కర్ణుడు అనిపించుకుంటున్నారు. మా జాతి చిరకాల కోరిక పోగొట్టుకున్న బిసి రిజర్వేషన్ కోసం చేసిన పోరాటానికి మీ అనుమతితో మీ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది.1 2 2016 రాత్రి మీడియాకు మీరు ఇంటర్వ్యూ ఇచ్చి జాతి కోరిక సమంజసమని చెప్పారని మిత్రులు చెబితే విన్నాను.
అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చారని విన్నాను. ఈరోజు మా కోరికను దానం చేయడానికి చేతులు ఎందుకు రావడం లేదండి. మీ విజయానికి మా జాతి సహకారం కొన్ని చోట్ల తప్ప అన్ని చోట్ల మీరు పొందలేదా? ఎన్నికలు జరిగిన అన్ని రోజులలో ఇంచుమించుగా ప్రతీరోజూ అప్పటి ముఖ్యమంత్రి గారు మాజాతి ఉద్యమాన్ని, పోలీసులతో చేయించిన దమనకాండ అరాచకాలు, అవమానాలు మీ ఛానెల్ లో చూపించిందే చూపించి మా జాతి సానుభూతి, ఓట్లు పొంద లేదా ముఖ్యమంత్రి గారు?
పాలకులు ప్రజల యొక్క కష్టాలలో పాలుపంచుకోవాలి. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు గారు, అప్పటి ముఖ్యమంత్రి మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు లాగా పూజలందుకో వాలే గాని పదవి మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి. ముఖ్యమంత్రి గారు దయచేసి మా జాతి సమస్య తీర్చమని భారత ప్రధాని గౌరవ మోడీ గారిని కోరమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు ముద్రగడ పద్మనాభం.