ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆకస్మికంగా లడక్ లో పర్యటించారు. గాల్వాన్ లోయలో భారత్ చైనా సైన్యం మధ్య ముష్టియుద్ధం జరగడం అందులో 20 మంది భారత సైనికులు మరణించడం తెలిసిందే. ఇప్పుడు తాజా పరిస్థితిని ప్రధాని సమీక్షిస్తున్నారు.లడక్ లోని నిము ప్రాంతంలో సీనియర్ ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయ్యారు.
ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. సరిహద్దులో తాజా పరిస్థితులను ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. చైనా బలగాలతో ఘర్షణలో గాయపడ్డ జవాన్లను మిలటరీ ఆస్పత్రిలో ప్రధాని పరామర్శించారు.