రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమెంధర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్స్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెంధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ లో అధికారం బీజేపీదేనని, కార్యకర్తలు అందరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలనీ పిలుపునిచ్చారు. అరాచక పాలన నుండి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రేపు జరగబోయే మన్ కి బాత్ కార్యక్రమం బూత్ స్థాయిలోనీ ప్రతి ఒక్క కార్యకర్త వీక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.