ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో తంగడి స్టేడియం నందు అఖిల్ రాథోడ్, జక్కుల కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 టీమ్ లతో సీసీఎల్ సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. గత 15 రోజులుగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ కు చేరిన అఖిల్ 11 మరియు ఆదర్శ్ క్రికెట్ టీంలు ఫైనల్ లో నిలవగా, సోమవారం ఈ రోజు జరిగిన మ్యాచ్ లో విజేత గా అఖిల్ 11 టీం నిలిచింది.
చివరి మ్యాచ్ల్లో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి రూ.11,000/-, రెండవ బహుమతి రూ.6,000/- లు నగదు మరియు ట్రోఫీలు అందుకున్నారు. నిర్వాహకులు అఖిల్ రాథోడ్, జక్కుల కుమార్ యాదవ్ మాట్లాడుతూ సీసీఎల్ సీజన్-2 త్వరలో నిర్వహిస్తామని తెలిపారు.