మార్చి 4న ములుగు జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్య మహాసభ బాధ్యుడు వంగేటి అశోక్ తెలిపారు. ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత గా మొట్టమొదటిసారి ఈ ఎన్నిక జరుగుతోందన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని శివాలయం ప్రాంగణంలో మార్చి 4న ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా శిరుప అనీల్ కుమార్ ను నియమించినట్లు ఆయన తెలిపారు. ఉదయం 10 గంటలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కాబట్టి పోటీలో ఉండే అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు. ముఖ్య అతిధి గా ఆర్యవైశ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం శెట్టి వైకుంఠం హాజరు కానున్నారని తెలిపారు. ఈ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు హాజరు కావాలని వంగేటి అశోక్ పిలుపునిచ్చారు.