ములుగు జిల్లా కు చెందిన పలువురు నాయకులు నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో బిజెపిలో చేరారు. వెంకటాపురం (నూగురు) ఎంపీపీ చేరుకూరి సతీష్ కుమార్ బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
వారితో పాటు మరికాల ఎంపీటీసీ రామిళ్ల లక్ష్మి శేఖర్, చొక్కాల వార్డ్ సభ్యులు, ఆదివాసి నవ నిర్మాణ సేన వెంకటాపురం మండల అధ్యక్షులు పొలబోయిన భార్గవ్, వి ఆర్ కె పురం వార్డ్ సభ్యులు చెరుకూరి కుమారి, వీరితో పాటు చేరుకుల మహాలక్ష్మి, చేరుకుల నాగరాజు, కాంపెల్ల సురేష్, జాది ప్రశాంత్, పొనగంటి నరేష్, బట్ట శ్రీధర్, మంచేనా గంగాధర బీజేపీ లో చేరారు.
ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఈ చేరికలు ఇపుడే మొదలయ్యాయని ఇక ముందు చాలా మంది ప్రజా ప్రతినిధులు తెరాస, కాంగ్రెస్ ల నుండి బీజేపీ లో చేరబోతున్నారని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలో వస్తుందని అన్నారు.
రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెరాస ప్రభుత్వం పై ప్రజా ఉద్యమాలు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, బీజేపీ శాసన సభ పక్ష నాయకులు రాజా సింగ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ రావు, ములుగు జిల్లా ఇంచార్జి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భద్ధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి, భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జి ఏనుగు రాకేష్ రెడ్డి, జిల్లా నాయకులు త్రినాథ్ రావు, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, చల్లూరి మహేందర్, వెంకటాపురం మందల అధ్యక్షులు అట్లూరి రఘు రామ్, కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.