నేషనల్ లెవెల్ ఇన్స్పైర్ పోటీలకు ములుగు జిల్లా నుంచి ఒక ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైనట్టు గా జిల్లా విద్యాశాఖ అధికారి పానిని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్లాపూర్ రేవంత్ సంక చేసిన ప్రాజెక్ట్ ఎంపికైనట్టు తెలిపారు. ఇటీవల ఆన్లైన్ లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు 365 పాజెక్టులు వచ్చాయని, వాటిలో నుంచి నేషనల్ కు 37 ప్రాజెక్టులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు కేంద్రం ఏటా ఈ పోటీలను నిర్వహిస్తోందని, రానున్న ఏప్రిల్ లో నేషనల్ లెవెల్ ఇన్స్పైర్ పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా డిఇఓ విద్యార్థి రేవంత్, గైడ్ టీచర్ నందకిషోర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రేగా కేశవరావు జిల్లా సైన్స్ అధికారి జయదేవ్ ని అభినందించారు.
previous post