అమరుల ఆశయ సాధన దిశగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని తీన్మార్ మల్లన్న అన్నారు. తీన్మార్ మల్లన్న టీం ములుగు జిల్లా కో కన్వీనర్ అచ్చునూరి కిషన్ నేడు హైదరాబాద్ లోని క్యూ న్యూస్ ఆఫీస్ లో తీన్మార్ మల్లన్న ను మర్యాదపూర్వకంగా కలిశారు. జైలు నుండి విడుదలైన క్యూ న్యూస్ జర్నలిస్టు, ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న కు స్వీట్ తినిపించారు.
ములుగు జిల్లా లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తీన్మార్ మల్లన్న పలు అంశాలపై ఓపిక తో విని అన్ని సమస్యల పరిష్కారం దిశగా త్వరలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుందామని చెప్పారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ఇంకా రెట్టింపు ఉత్సాహంతో టీం ముందుకు వెళ్ళేలా అతి త్వరలో ‘దశ దిశ’ నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు.
అప్పటి వరకు టీం సభ్యులందరు సంయమనం తో ఉండాలని తీన్మార్ మల్లన్న తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు సంగప్ప, శనార్తి తెలంగాణ దినపత్రిక ఇంచార్జీ శ్రీనివాస్, జనగాం జిల్లా కో కన్వీనర్ తుప్పతి శ్రీనివాస్, పాండు, దిలీప్ తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.