ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని చెంచు కాలనీ లో అగ్రి ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాలకు ఆయన బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. వీటితో పాటు ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన అందజేశారు.
అనంతరం ములుగు జిల్లా DRO కు కాల్ చేసి ఒకసారి ఈ గృహాలను ప్రత్యక్షంగా పరిశీలించి వారి కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందే విధంగా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధుకారులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం అగ్నిప్రమాదానికి అక్కడి 5 నివాస గృహాలు ఆహుతి అయిన విషయం తెలిసిందే.
కే.మహేందర్ గౌడ్, సత్యం న్యూస్