సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలోని లే అవుట్ భూములను కాపాడాలని,లే అవుట్ భూములను కాజేసిన వారి పై తగిన చర్యలు తీసుకోవాలంటూ కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,జక్కుల వీరయ్య లు మున్సిపాల్టీ గేటు ముందు కూర్చొని ఆందోళన చేశారు.
మున్సిపాల్టీ ఆస్తులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. మున్సిపాల్టీ కార్యాలయం కు కలెక్టర్ వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగా కౌన్సిలర్లు మున్సిపాల్టీ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కౌన్సిలర్లు జక్కుల వీరయ్య, కోతి సంపత్ రెడ్డి ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.